గ్రామసంఘం నిధులు దోపిడీ

10 Dec, 2018 07:56 IST|Sakshi

శ్రీకాకుళం : అన్నా.. మహిళల ఉపాధి కోసం గ్రామ సంఘం ద్వారా మంజూరైన రూ.5 లక్షల నిధులను టీడీపీ నేత రౌతు శ్రీనివాసరావు అడ్డుగోలుగా దోచుకున్నారు. లావేరు మండలం బుడతవలస గ్రామైక్య సంఘానికి వ్యవసాయ పనిముట్లు, టార్పాలిన్లు, స్ప్రేయర్లు కొనుగోలుకు ఈ నిధులు మంజూరయ్యాయి. ఎటువంటి తీర్మానం లేకుండా అడ్డుగోలుగా నిధులు డ్రా చేసి దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని కలెక్టర్, వెలుగు పీడీ దృష్టికి తీసుకువెళ్లినా మంత్రి కళావెంకటరావు ఒత్తిడితో చర్యలు తీసుకోవడం లేదు.– రౌతు సన్యాసమ్మ, బుడతవలస

మరిన్ని వార్తలు