సెల్ టవర్ల ఏర్పాటుపై ఆందోళన

29 Jul, 2015 13:28 IST|Sakshi

బొబ్బిలి(విజయనగరం): విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థానిక 14వ, 23వ వార్డుల్లో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయతలపెట్టిన సెల్ టవర్లను స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై వారు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం నుంచి పోలీసులు సెక్షన్ 30 విధించారు. ప్రజలు గుంపులుగా ఉండరాదని, ఆందోళనలు చేయరాదని హెచ్చరించారు. ప్రజల ఆందోళనలతో భారీగా పోలీసులను మోహరించారు. దీంతో పట్టణంలో ఉద్రిక్తత ఏర్పడింది.

మరిన్ని వార్తలు