రేషన్ కార్డుల కోసం అధికారుల నిర్బంధం

6 Feb, 2016 16:24 IST|Sakshi

కొత్తూరు (శ్రీకాకుళం జిల్లా) : శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో బమ్మిడి గ్రామంలో రేషన్ కార్డులను ఇవ్వడం లేదని గ్రామస్థులు రెవెన్యూ అధికారులను శనివారం పంచాయతీ కార్యాలయంలో నిర్భంధించారు. జన్మభూమి కమిటీలో పేర్లు నమోదుచేసుకున్నప్పటికీ తమకు రేషన్ కార్డులు పంపిణీ చేయట్లేదని గ్రామస్థులు గ్రామ ఆర్‌ఐ,వీఆర్‌వోలను నిర్బంధించారు. గ్రామస్థుల ఆందోళనతో తహసీల్దార్ ఆదేశాల మేరకు పోలీసుల పహారాలో అధికారులు రేషన్‌కార్డులను పంపిణీ చేశారు.

మరిన్ని వార్తలు