వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధులుగా విశాఖ జిల్లా నుంచి ముగ్గురు

20 Oct, 2019 08:26 IST|Sakshi
గుడివాడ అమర్‌నాథ్‌, అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌, కొండా రాజీవ్‌

అమర్‌నాథ్, అదీప్‌రాజ్, కొండా రాజీవ్‌లకు అవకాశం

సాక్షి,విశాఖపట్నం:  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధులుగా జిల్లాకు చెందిన ముగ్గురు నేతలను నియమిస్తూ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి, రాజ్యసభ సభ్యుడు, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుంబాక విజయసాయి రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అనకాపల్లి, పెందుర్తి ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాథ్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, పార్టీ నగర యువజన అధ్యక్షుడు కొండా రాజీవ్‌గాంధీలను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు నియమించినట్లు విజయసాయిరెడ్డి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు