సాక్షి, విశాఖపట్నం : మావోయిస్టు సంస్మరణ వారోత్సవాల నేపథ్యంలో ఎలాంటి దాడులు జరగకుండా విశాఖ మన్యంలో ముందస్తు హైఅలర్ట్ విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు గుర్రాలపై పెట్రోలింగ్ నిర్వహిస్తూ ముమ్మర తనిఖీలు నిర్వహించారు. మావోలకు వ్యతిరేకంగా సంతల్లో శాంతి స్థూపాలు నెలకొల్పినట్లు తెలిపారు.