వేదిక ఏలూరు ఆర్టీసీ గ్రౌండ్
సాక్షి ప్రతినిధి, ఏలూరు : సాక్షి దినపత్రిక ఆధ్వరంలో ఈనెల 25, 26 తేదీల్లో ఏలూరు కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న ఏపీఎస్ఆర్టీసీ గ్రౌండ్లో మెగా ఆటో షో నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరిగే ఈ షోను ప్రజలు ఉచితంగా సందర్శించవచ్చు. షోలో అన్ని రకాల మోడల్ కార్లు, బైకులు అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాహనాల ఫీచర్లను స్వయంగా పరిశీలించవచ్చు. షోలో వాహనాలు కొన్న వారికి ప్రత్యేక రాయితీలు ఉంటాయి. కుశలవ హోండయి, రెనాల్ట్, మారుతీ సుజి కీ, లీలా కృష్ణా టయోటా, కంటిపూడి నిస్సాన్, సుందరం హోండా వంటి కార్ల కంపెనీలతోపాటు శ్రీకృష్ణా సుజికీ, పవన్ హోండా, సాయి స్వర్ణామోటార్స్(హీరో), కెటీఎం, శ్రీగోకుల్ టీవీఎస్, శ్రీఎంఆర్సీ యమహా, క్లాసిక్ ఆటోమోటివ్ రాయల్ ఎన్ఫీల్డ్, మోహన్సాయి బజాజ్, ఎంపైర్ బ్యాటరీ బైక్ వంటి ద్విచక్రవాహన కంపెనీలు షోలో పాల్గొంటాయి.
ఫైనాన్స్ కోసం స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రాబ్యాంక్ స్టాల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. వాహనాల విడిభాగాలు, ఫైనాన్స్, మార్చుకొనే సదుపాయం, ఇన్సూరెన్స్ సేవల స్టాల్స్ కూడా ఉంటాయి. ఆటో షోలో వాహనాలకు ఫైవ్ పాయింట్ చెకప్లు, టెస్ట్ డ్రైవ్లు నిర్వహిస్తారు. గంటగంటకూ లక్కీడ్రా నిర్వహించి చందన బ్రదర్స్ ద్వారా గిఫ్ట్ కూపన్లూ అందిస్తారు. బంపర్ డ్రాలో శ్రీకృష్ణా సుజుకీ సౌజన్యంతో యాక్సిస్ 125 స్కూటర్ను గెలుచుకునే అవకాశం కలదు. మీడియా పార్టనర్గా సాక్షి టీవీ వ్యవహరిస్తుంది. ఆటో షోకు సంబంధించి స్టాల్స్ బుకింగ్, ఇతర వివరాల కోసం 9912220558, 9951602861 నంబర్లను సంప్రదించవచ్చు.