శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

4 Feb, 2017 11:17 IST|Sakshi
శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

తిరుమల:
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఏపీ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు.

అనంతరం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే నారాయణ స్వామి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ ఆర్‌ నాయక్‌, చెన‍్నయ్‌ ఇన్‌కంటాక్స్‌ డైరెక‍్టర్‌ జనరల్‌ మురళీ కుమార్‌, శ్రీకాళహస్తికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత బియ‍్యపు మధుసూదనరెడ్డి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం ప్రముఖులకు  రంగనాయకుల మండపం వద్ద వేదాశీర్వచనం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.

మరిన్ని వార్తలు