గోడకూలి విద్యార్థిని మృతి

7 Sep, 2015 08:30 IST|Sakshi

రైల్వే కోడూరు: వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు మండలకేంద్రంలోని లక్ష్మీనగర్‌లో సోమవారం తెల్లవారుజామున గోడ కూలి బత్తుల దేవి (11) అనే విద్యార్థిని దుర్మరణం చెందింది.

 

భారీ వర్షం కారణంగా బలహీనంగా ఉన్న ఇంటిగోడ కూలడం వల్లే ఈ ప్రమాదం జరిగింది.  ప్రమాదంలో బాలికతో పాటు మరో మేకపిల్ల కూడా మరణించింది. మృతురాలు స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది.

>
మరిన్ని వార్తలు