నాణ్యత మహానందీశుడికెరుక !

28 May, 2020 11:55 IST|Sakshi

పైప్‌ వాటర్‌ ఫోర్స్‌కే కూలిన గోడ

మహానంది: మహానంది క్షేత్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. పట్టుమని ఆరునెలలు కూడా కాకముందే రాజగోపురం ముందు భాగంలో రెండు సుపథ మండపాల మధ్యలో గ్రీనరీ కోసం యూ ఆకారంలో నిర్మించిన గోడ బుధవారం కూలిపోయింది. గోడల మధ్యలో వేసిన మట్టికి పైప్‌ ద్వారా నీరు పడుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, చిన్నపాటి నీటి ఫోర్స్‌కే ఇలా జరగడంతో నిర్మాణాల్లో  నాణ్యతపై స్ధానికులు, భక్తులు పెదవి విరుస్తున్నారు. దీనిపై ఈఓ మల్లికార్జునప్రసాద్‌ మాట్లాడుతూ  సిబ్బంది ఫైర్‌ ఇంజన్లకు వాడే పైపుతో  నీరు పట్టడం ద్వారా ఫోర్స్‌కు గోడ కూలిపోయిందని బాధ్యులపై  చర్యలు తీసుకుంటానని చెప్పారు. కాగా  ఈ గోడ నిర్మాణానికి సుమారు రూ. 55 వేలకు పైగా ఖర్చు చేసినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.     

మరిన్ని వార్తలు