క‘న్నీటి’ కష్టాలు
వేసవి రాకముందే మంచి నీటి సమస్య విద్యార్థినులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. గోనెగండ్ల కస్తూరిబా గాంధీ పాఠశాలలో వంద మంది చదువుతున్నారు. పది రోజుల క్రితం ఇక్కడ విద్యుత్ మోటారు మాయమైంది. దీంతో నీటి సరఫరా బంద్ అయింది
నీళ్లు లేకపోవడంతో రెండు, మూడు రోజులకో సారి స్నానం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని విద్యార్థునులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ శివారులోని చింతలాముని గుడి వద్దకు అరకిలోమీటర్ నడిచివెళ్లి కుళాయిల నీరు బకెట్లలో తెచ్చుకుంటున్నామని తెలిపారు. ఇదిలా ఉండగా వీరి కష్టాలను చూసిన పాఠశాల అధికారి రెండు రోజులు ట్యాంకర్ ద్వారా నీటిని తెప్పించి చేతులెత్తేశారు.- గోనెగండ్ల