848 అడుగులకు చేరిన శ్రీశైలం నీటిమట్టం

12 Oct, 2015 20:17 IST|Sakshi


ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం జలాశయం వద్ద నీటి మట్టం పెరుగుతోంది. సోమవారం సాయంత్రానికి నీటి మట్టం 848.20 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి జలాశయానికి 4,479 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది.

డ్యాం నుంచి హంద్రీనీవా సుజల స్రవంతికి 1,690 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.  ప్రస్తుతం జలాశయంలో 76.1448 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు