'నీరు-చెట్టు' పేరిట మట్టి దోపిడీ

28 Apr, 2015 04:39 IST|Sakshi
'నీరు-చెట్టు' పేరిట మట్టి దోపిడీ

వైఎస్ జగన్‌కు వైఎస్సార్‌సీపీ నేతల ఫిర్యాదు
గన్నవరం: జిల్లాలో నీరు-చెట్టు కార్యక్రమం పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకులు మట్టి దోపిడీకి పాల్పడుతున్నారని వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కృష్ణా జిల్లా పర్యటన పూర్తిచేస్తుకుని బెంగళూరు వెళ్లేందుకు సోమవారం గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో కొద్దిసేపు సమావేశమయ్యారు.

నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వమే క్యూబిక్ మీటరుకు రూ.30 వెచ్చించి పొక్లెయిన్‌తో రైతులకు ఉచితంగా మట్టి లోడింగ్ చేయాల్సి ఉందని చెప్పారు. కలెక్టర్ పర్యవేక్షణలో ఇరిగేషన్ అధికారులు దగ్గరుండి చెరువుల్లో మట్టి తవ్వించాల్సి ఉందన్నారు. అయితే జిల్లాలో టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా చెరువులు తవ్వుకుంటూ మట్టి లోడింగ్‌కు రూ.150 నుంచి రూ.300 వరకు వసూలు చేసి కోట్లు దండుకుంటున్నారని చెప్పారు.

మరిన్ని వార్తలు