ప్రకాశం బ్యారేజీవద్ద ప్రమాద ఘంటికలు

13 Mar, 2015 23:29 IST|Sakshi
ప్రకాశం బ్యారేజీవద్ద ప్రమాద ఘంటికలు

విజయవాడ: ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రమాద ఘంటికలు చోటుచేసుకున్నాయి. బ్యారేజీలోని నీటిమట్టం కనిష్టస్థాయికి చేరింది. 8.04 అడుగులకు బ్యారేజీలో నీరు చేరుకుంది. దీంతో వీటీపీఎస్లో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగే అవకాశం ఏర్పడింది. ఎగువ నుంచి నీటి విడుదల లేకుంటే ఏమి చేయలేమని ఇరిగేషన్ అధికారులు అంటున్నారు.

మరిన్ని వార్తలు