మాకు పేస్కేల్‌ అమలు చేయాలి

23 Jun, 2019 19:56 IST|Sakshi

విజయవాడ: లైసెన్సుడ్ సర్వేయర్లను అసిస్టెంట్‌ సర్వేయర్లుగా నియమించాలని సర్వేయర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య ప్రభుత్వాన్ని కోరారు. 2004లో  అప్పటి సీఎం వైఎస్ఆర్ రాష్ట్రంలో సర్వేయర్ల కొరత తీర్చుటకు లైసెన్స్ సర్వేయర్ల వ్యవస్థ తెచ్చారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం మమ్ములను అసిస్టెంట్ సర్వేయర్ల పేరుతో జూనియర్ అసిస్టెంట్  పేస్కేల్ ప్రకటించి అమలు చేయలేదన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ పాదయాత్రలో మా సమస్యలు విని సానుకూలంగా స్పందించారని ఇప్పుడు ముఖ్యమంత్రిగా గెలిచినందున వెంటనే మాకు పేస్కేల్ అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు

>
మరిన్ని వార్తలు