మరోసారి నమ్మిమోసపోవడానికి సిద్ధంగా లేం

21 Feb, 2019 16:31 IST|Sakshi

చంద్రబాబు మాకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదు

కంప్యూటర్‌ టీచర్స్‌ జేఏసీ

సాక్షి, అమరావతి:  ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఒకసారి నమ్మి మోసపోయామని, మరోసారి ఆయనను నమ్మి మోసపోవడానికి తాము సిద్ధంగా లేమని కంప్యూటర్‌ టీచర్స్‌ జేఏసీ స్పష్టం చేసింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్‌ ఉప్యాధాయులుగా తమను తీసుకుంటామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. గెలిచి అధికారంలోకి వచ్చాక.. ఇచ్చిన హామీని నెరవేర్చలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబును, మంత్రులు లోకేశ్‌, గంటా శ్రీనివాసరావులను ఎన్నిసార్లు కలిసి.. తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసినా.. వారు పట్టించుకున్న పాపాన పోలేదని, ఈసారి ఎన్నికల్లో టీడీపీని నమ్మే ప్రసక్తే లేదని కంప్యూటర్‌ టీచర్స్‌ జేఏసీ ప్రతినిధులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు