హైదరాబాద్ను యూటీ చేస్తే.. తెలంగాణకు సహకరిస్తాం: జేడీ శీలం

25 Nov, 2013 21:14 IST|Sakshi
హైదరాబాద్ను యూటీ చేస్తే.. తెలంగాణకు సహకరిస్తాం: జేడీ శీలం

హైదరాబాద్ నగరాన్ని కొన్ని సంవత్సరాలైనా కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని, అలాగైతే తెలంగాణకు తాము సహకరిస్తామని కేంద్ర మంత్రి జేడీ శీలం తెలిపారు. అలాగే ఈ ప్రతిపాదనకు అందరినీ ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తామన్నారు.

కనీసం సీమాంధ్ర రాజధాని ఏర్పడేంతవరకు హైదరాబాద్లో తమకు అవకాశం ఇస్తే చాలని శీలం చెప్పారు. రాయల తెలంగాణపై తమకు సమాచారం లేదని ఆయన న్యూఢిల్లీలో సోమవారం నాడు 'సాక్షి'తో మాట్లాడుతూ అన్నారు.

మరిన్ని వార్తలు