సాక్షి, మంత్రాలయం (కర్నూలు జిల్లా): భార్య భర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంత్రాలయం మండలం వగరూరులో మంగళవారం రాత్రి పొద్దుపోయాక చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దంపతులు సుదర్శన్, సునామి కూలీ డబ్బులు విషయంలో గొడవ పడ్డారు. మనస్థాపం చెందిన ఇద్దరూ ఇంట్లో నిలువ ఉన్న పురుగుల మందు సేవించారు. గమనించిన కుటుంబ సభ్యులు వారిని చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రసుత్తం వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.