విభజనపై సుప్రీంకోర్టుకు వెళ్తా: రఘురాజు

6 Dec, 2013 12:37 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియ దేశ రాజ్యాంగానికి పూర్తి విరుద్ధంగా జరుగుతుందని ప్రముఖ పారిశ్రామికవేత్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు (రఘురాజు) ఆరోపించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో మాట్లాడుతూ... ఉమ్మడి రాజధాని అంశం రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదని ఆయన తెలిపారు.

 

371 (డి) రెండు రాష్ట్రాలకు ఎలా అమలు చేస్తారని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. విభజన విధానం సరిగ్గా లేదని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని కృష్ణంరాజు తెలిపారు.

మరిన్ని వార్తలు