సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పార్లమెంటు సభ్యుల ఇళ్లముందు ఈనెల 29న ధర్నాలు చేయనున్నట్లు ఏపీ ఎన్జీవోల సంఘం నాయకులు తెలిపారు. సమైక్యాంధ్రకే కట్టుబడి ఉండాలంటూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహాధర్నా చేస్తామన్నారు.
సమైక్యాంధ్ర సాధన కోసం హైదరాబాద్లో త్వరలో సన్నాహక సమావేశం జరుగుతుందని, అలాగే విశాఖ, తిరుపతి, విజయవాడ, కడప, అనంతపురాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర విభజనకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని ఏపీ ఎన్జీవోలు స్పష్టం చేశారు.
సమైక్యాంధ్ర కోసం అవసరమయితే వంద రోజుల సమ్మెకు దిగుతామని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు హెచ్చరించారు. సమైక్యాంధ్ర విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రం ముమ్మాటికీ ఉమ్మడి ఆస్తే, వదులుకునే ప్రసక్తే ఉండదన్నారు. తెలంగాణవాదులు చెబుతున్న వెనుకబాటుతనంలో వాస్తవం లేదన్నారు.