'విభజన బిల్లును ముందుకు పోనివ్వం'

16 Dec, 2013 11:10 IST|Sakshi
'విభజన బిల్లును ముందుకు పోనివ్వం'

విభజన బిల్లును ముందుకు వెళ్లనిచ్చేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. తమకు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఈ విషయంలో తోడుంటారని వారు అంటున్నారు. ఇంత కీలకమైన సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం అసెంబ్లీ నుంచి దొడ్డిదారిన పారిపోయారని మండిపడ్డారు. విభజనకు తాము పూర్తిగా వ్యతిరేకమని తెలిపారు. కిరణ్, చంద్రబాబుల వల్లే అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వచ్చిందని మండిపడ్డారు.

కాగా, ఒకే సమయంలో ఇద్దరు పార్టీల వాళ్లు వెళ్తే యుద్ధ వాతావరణం ఉంటుందనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అక్కడినుంచి పంపేందుకు ప్రయత్నించామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అన్ని పార్టీల వాళ్లు స్వేచ్ఛగా మాట్లాడుకునేందుకు తాము అవకాశం కల్పిస్తున్నామని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు