యడ్లపాడులో విషాదం

25 Jul, 2017 09:31 IST|Sakshi

యడ్లపాడు: గుంటూరు జిల్లా యడ్లపాడులో విషాదం చోటు చేసుకుంది. తన ఇద్దరు కుమారులతో ఓ తల్లి యడ్లపాడు పరిధిలో ఎన్‌ఎస్‌పీ కాలువ సమీపంలోని బావిలో ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగానే పసిబిడ్డలతో కలసి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు..  మృతులను కోడిరెక్క భూలక్ష్మి(25), ఆమె కుమారుడు రాము(4), కుమార్తె అఖిల(3)లుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు