కారు బోల్తా: మహిళ మృతి

22 Dec, 2015 17:47 IST|Sakshi

పులివెందుల (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా పులివెందులలోని నామాలగుండు వద్ద ఓ కారు బోల్తా పడి జయకళ(38) అనే ఉపాధ్యాయురాలు మృతిచెందారు. ఈ ప్రమాదం మంగళవారం సాయంత్రం 5 గంటలకు జరిగింది. గొల్లపల్లి తాండాలో పనిచేస్తున్న ఆమె అటుగా వస్తున్న కారులో లిఫ్ట్ అడిగి ఎక్కారు. అయితే పులివెందుల శివారులో కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను పులివెందుల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు