పొలాల్లో మహిళ మృతదేహం

5 Sep, 2015 18:35 IST|Sakshi

పెద్దపప్పూరు (అనంతపురం) : అనంతపురం జిల్లాలో గుర్తు తెలియని మహిళ శవం పంట పొలాల్లో కనిపించింది. జిల్లాలోని పెద్దపప్పూరు మండలంలోని నరసాపురం గ్రామంలో పంట పొలాల్లో స్థానికులు శనివారం ఓ మహిళ మృతదేహం పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలిది సహజ మరణమా లేదా హత్యా అనేది తేలాల్సి ఉంది. అలాగే మృతురాలు వివరాలు కూడా తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు