పాముకాటుతో మహిళ మృతి

21 Aug, 2015 16:40 IST|Sakshi

అనంతపురం (నార్పల) : పాము కాటుకు ఓ మహిళ బలైంది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రం శివారులోని ఓ మిరపతోటలో పనిచేస్తున్న మహిళను పాము కాటేసింది. గమనించిన స్థానికులు హుటాహుటిన బాధిత మహిళ నారమ్మ(55)ను నార్పలలోని ఓ ఆసుపత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ ఆమె కొద్దిసేపటికే మృతిచెందింది.

మరిన్ని వార్తలు