కొడుకు వైద్యం కోసం వచ్చి అనంత లోకాలకు..

17 Aug, 2019 20:47 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, వైఎస్సార్‌ కడప : జిల్లాలోని బద్వేలులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుమారుడికి వైద్యం చేయించేందుకు వచ్చిన ఓ తల్లి అనూహ్యరీతిలో ప్రాణాలు విడిచారు. కొడుకు అనారోగ్యంతో బాధపడుతుంటడంతో వెంకటదేవి అనే మహిళ అతన్ని తీసుకుని బద్వేలులోని సుమిత్రానగర్‌లో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి వచ్చారు. ఈ క్రమంలో ఆమెకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడిక్కడే ఆమె కుప్పకూలిపోయారు. వెంకటదేవి మరణించినట్టు వైద్యులు తెలిపారు.

మరిన్ని వార్తలు