ఆర్టీసీ బస్సు ఢీ: మహిళ మృతి

4 Jul, 2015 10:10 IST|Sakshi

చిత్తూరు (తిరుపతి): తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మంగళం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ మహిళ మృతిచెందింది. ఆమె పట్టణంలోని పెద్దకాపు వీధికి చెందిన లక్ష్మి(30) గా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మహిళ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు