విజయనగరం :చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు పూర్తయినా రుణాలు మాఫీ కాలేదు. ఆయన హామీతో మేము బ్యాంక్ అప్పు చెల్లించలేదు. రుణాన్ని వడ్డీతో పాటు పూర్తిగా చెల్లించాలని బ్యాంక్ అధికారులు బెదిరిస్తున్నారు.. అంటూ మక్కువ మండలం తూరుమామిడికి చెందిన డ్వాక్రా మహిళలు కురసాన గంగమ్మ, గొల్లపల్లి ఆదిలక్ష్మి, బోసు రూపావతి, కెల్ల సత్యవతి, గంగమ్మ, సూరమ్మ తదితరులు జగన్ ఎదుట మొర పెట్టుకున్నారు. తానున్నానని జగన్ ఇచ్చిన హామీతో ఆనందభరితులయ్యారు.