ప్రియుడితో కలిసి బంధువు హత్య

28 Aug, 2013 23:04 IST|Sakshi

హైద‌రాబాద్‌: పేట్ బషీర్‌బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పద్మారావు నగర్‌ ఫేస్‌టూలోని బాపూనగర్‌లో బుధ‌వారం దారుణం చోటుచేసుకుంది. ర‌జిని అనే యువ‌తి త‌న ప్రియుడితో క‌లిసి స‌మీప బంధ‌వును హ‌త్యచేసింది. ఆమె బంధువు కృష్ణచైతన్యరెడ్డి అనే యువకునికి తినే ఆహారంలో విషం క‌ల‌పి ఇచ్చింది. దీంతో ఆ యువకుడు మృతిచెందాడు. ప్రియుడు సహాయంతో ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడింది. అనంత‌రం  రజిని ఆ శ‌వాన్ని గోనెసంచిలో క‌ట్టి మాయం చేసేందుకు య‌త్నించినట్టు సమాచారం.

>
మరిన్ని వార్తలు