వేధింపులతో వివాహిత ఆత్మహత్య

21 Feb, 2016 11:34 IST|Sakshi

తెనాలి: గుంటూరు జిల్లాలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. తెనాలి మండలం పినపాడుకు చెందిన షేక్ నజీనా(32) శనివారం అర్ధరాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఆదివారం ఉదయం ఎంతకీ తలుపులు తీయకపోవడంతో స్థానికులు తలుపులు తెరిచిచూడడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. అత్తింటి వారి వేధింపుల వల్లే నజీనా మృతి చెందిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు.

మరిన్ని వార్తలు