మహిళా గంజాయి ముఠా అరెస్టు

5 Nov, 2015 10:33 IST|Sakshi

యలమంచిలో మహిళా గంజాయి ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 80 కేజీల గంజాయి, రూ50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో ఇద్దరు ఢిల్లీ, మరో ఇద్దరు చెన్నై, వరంగల్ కి చెందిన మహిళలు ఉన్నారు. విశాఖ నుంచి దేశంలో వివిధ ప్రాంతాలకు వీరు గంజాయి రవాణా చేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.


 

>
మరిన్ని వార్తలు