చిట్టిల మోసగాడికి మహిళల దేహశుద్ధి

26 Feb, 2015 21:50 IST|Sakshi

తగరపువలస(విశాఖపట్టణం): చిట్టిల పేరుతో డబ్బులు వసూలు చేసి ప్రజలను మోసం చేసిన ఒక వ్యక్తికి మహిళలు దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన విశాఖ జిల్లా తగరపువలసలోని కొండపేట గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన చిట్టిల నిర్వాహకుడు వెంకట్రావు పలువురి వద్ద నుంచి డబ్బులు వసూలు చేశాడు. తీరా డబ్బులు తిరిగి ఇవ్వాల్సి సమయంలో ముఖం చాటేసి తప్పించుకొని తిరుగుతున్నాడు. గురువారం రాత్రి అతన్ని పట్టుకున్న మహిళలు అతనికి దేహశుద్ధి చేశారు.

మరిన్ని వార్తలు