లైంగిక వేధింపులపై స్పందించిన మహిళ కమిషన్‌

21 Sep, 2019 14:02 IST|Sakshi

సాక్షి, విజయవాడ : మచిలీపట్నంలోని సారా గ్రేస్‌ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌ కరస్పాండెంట్‌ విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటనపై మహిళా కమిషన్‌ స్పందించింది. కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ శనివారం కాలేజీని సందర్శించారు. ఈ క్రమంలో విద్యార్థినులతో ముఖాముఖి నిర్వహించిన ఆమె..ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో సహా ఇతరులెవరినీ కమిషన్‌ ఈ కార్యక్రమానికి అనుమతించలేదు. ఈ నేపథ్యంలో విద్యార్థినులతో సమావేశమైన వాసిరెడ్డి పద్మ కళాశాల కరస్పాండెంట్‌ తీరుతెన్నుల గురించి ఆరా తీశారు.(చదవండి : కోరిక తీరిస్తేనే.. లేదంటే జీవితాంతం..)

మరిన్ని వార్తలు