ప్రమాదంతోప్రయాణం.. ప్రాణాలతో చెలగాటం!

4 Feb, 2020 12:18 IST|Sakshi

గుంటూరు, పెదకాకాని: గ్రామాల్లో ఆటో ప్రయాణం ప్రాణాలతో చెలగాటంగా మారింది. డ్రైవర్ల అత్యాశ, ప్రయాణికుల అవసరం ప్రమాదాలకు కారణమవుతోంది. ఎన్నో జీవితాలను చీకటిలోకి నెట్టేస్తోంది. పెదకాకాని మండల పరిధిలోని నంబూరు గ్రామం నుంచి వెనిగండ్ల మిరపకాయల కోతలు, పత్తి తీసేందుకు బయలుదేరారు. ఆరుగురు మాత్రమే ప్రయాణం చేసే అప్పీఆటోలో 18 మంది ఎక్కారు. వెనుక, ముందు, పక్కన వేలాడుతూ ప్రయాణాలు చేస్తున్నారు. ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ సోమవారం క్లిక్‌ మనిపించింది.

మరిన్ని వార్తలు