మహానందిలో అపశ్రుతి

15 May, 2018 12:00 IST|Sakshi

సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా మహానందిలో మంగళవారం అపశ్రుతి చోటు చేసుకుంది. స్వామి దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలు మృతి చెందింది. గుంటూరు జిల్లా గురజాల గ్రామానికి చెందిన రత్నాలు(40) అనే మహిళ మహానందీశ్వరుని దర్శనానికి వచ్చి కోనేటిలో స్నానం చేస్తుండగా పిట్స్‌ రావడంతో ఆమె నీట మునిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. 

మరిన్ని వార్తలు