మహిళా కౌలు రైతు ఆత్మహత్య

10 Feb, 2016 12:35 IST|Sakshi

ప్రకాశం: అప్పుల బాధ తాళలేక ఓ మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కల్లవారిపాలెం గ్రామంలో బుధవారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన గొట్టిపాటి విజయకుమారి(41) 18 ఎకరాల భూమి కౌలుకు తీసుకొని పత్తి సాగు చేసింది. ఈ క్రమంలో పెట్టుబడుల కోసం సుమారు రూ. 15 లక్షల వరకు అప్పులు తెచ్చింది. దిగుబడి సరిగ్గా లేకపోవడంతో.. తెచ్చిన అప్పులు తీర్చే దారి కానరాక ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు