మహిళా కూలీకి వజ్రం లభ్యం

8 Jul, 2020 11:45 IST|Sakshi

కర్నూలు, తుగ్గలి :తుగ్గలి  మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన ఓ మహిళా కూలీకి సోమవారం వజ్రం లభ్యమైనట్లు సమాచారం. వేరుశనగ విత్తనం విత్తేందుకు వెళ్లిన మహిళా కూలీకి వజ్రం కంట పడడంతో ఆగి తీసుకుంది. 5 క్యారెట్లకు పైగా ఉన్న ఈ వజ్రాన్ని అదే రోజు రాత్రి అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఓ వ్యాపారి రూ.5.50 లక్షల నగదు, 3తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేసినట్లు తెలిసింది.
(రైతుకు చిక్కిన రూ.కోటి వజ్రం..)

మరిన్ని వార్తలు