మగశిశువుకు జన్మనిచ్చి బాత్రూమ్లో వదిలేసి వెళ్లారు
శిశువు ఏడుపు విని చూసిన గుర్తించిన ఆస్పత్రి సిబ్బంది
గుడిపాల: ఓ తల్లి మగశిశువుకు జన్మనిచ్చి బాత్రూమ్లో వదిలేసి వెళ్లిపోయింది. ఆ శిశువు ఏడుపు విని స్థాని కులు ఆస్పత్రికి తరలించారు. గుడిపాల మండలానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ సుబ్రమణ్యం వద్దకు ఓ మహిళ మంగళవారం ఉదయం వచ్చింది. అధికంగా బ్లీడింగ్ పోతుందని తెలియజేసింది. డాక్టర్ ఇంజక్షన్ వేశాడు. అప్పటికే రోగులు అధికంగా ఉండడంతో ఆ మహిళ గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. కొంతసేపటికే ఆస్పత్రి పక్కనే ఉన్న బాత్రూంలో శిశువు ఏడుపు వినిపించింది. గమనించగా మగశిశువు కనిపిం చింది. ఇంతలో ఆ మహిళ కనిపించకుండా వెళ్లిపోయింది. వెంటనే గుడిపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శిశువును తీసుకువెళ్లారు. ఐసీడీఎస్ అధికారులకు తెలియజేశారు.