ప్రకాశం జిల్లాలో ఉద్రిక్తత

11 Dec, 2017 12:06 IST|Sakshi

సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మండలంలోని మలపాడులో మద్యం షాపు ఏర్పాటు చేయొద్దంటూ సోమవారం మహిళలు ధర్నాకు దిగారు. మహిళల ధర్నాను పోలీసులు అడ్డుకుని అరెస్టుకు యత్నించారు. దీంతో గ్రామస్తులు పోలీసులను అడ్డుకోవడంతో  ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. 

మరోవైపు జిల్లాలోని సంతమగులూరులో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఇంటి స్థలం విషయంలో వివాదం నెలకొనడంతో ఇరువర్గాల వారు కొట్లాటకు దిగారు. ఈ ఘటనలో పలువురి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

మరిన్ని వార్తలు