అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

13 Feb, 2015 12:25 IST|Sakshi

సామర్లకోట:  అనుమానాస్పద స్థితిలో ఓ యువతి మృతి చెందిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా సామర్లకోటలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. సామర్లకోటలోని రజకపేటకు చెందిన ఎమ్.కావమ్మ(23) జయ డార్మటరీలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

కూలీ పని చేసి జీవనం సాగించే ఆమె డార్మటరీలో చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా ఆమె మృతికి గల కారణాలు తెలియరాలేదు. విషయం తెలిసుకున్న  పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు