కదిలిన మహిళా సంఘాలు

10 Jun, 2014 16:05 IST|Sakshi

హైదరాబాద్ : మద్యంపై మహిళా సంఘాలు మళ్లీ కదిలాయి.  మద్య నింత్రణ ఉద్యమ కమిటీ మహిళా సంఘాల నేతలు ఈ రోజు నాంపల్లి అబ్కారీ భవన్లో రెండు రాష్ట్రాల ఎక్సైజ్ కమిషనర్లను కలిశారు.


మద్యం అమ్మకాలను ప్రభుత్వాలు ఆదాయ వనరుగా చూడరాదని వారు కమిషనర్లను కోరారు.  ఎక్సైజ్ సిబ్బందికి లక్ష్యాలు కూడా  విధించవద్దని  విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు