విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి

2 Aug, 2015 08:55 IST|Sakshi

విజయనగరం : విజయనగరం జిల్లా కేంద్రంలోని వీ టీ అగ్రహారంలో ఉన్న అరుణ్ జూట్ మిల్లులో పనిచేస్తున్న బి.అప్పలనాయుడు(35) అనే కార్మికుడు మిల్లులో పనిచేస్తుండగా ఆదివారం తెల్లవారుజామున కరెంట్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

కాగా మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కార్మిక నేతలు మిల్లు ఎదుట ఆందోళన చేపట్టారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు