కొమరాడలో వడదెబ్బకు కూలీ మృతి

24 May, 2015 16:52 IST|Sakshi

విజయనగరం: విజయనగరం జిల్లాలోని కొమరాడ మండలంలో వడదెబ్బకు కూలీ మృతి చెందాడు. వివరాలు.. మండలానికి చెందిన సోములు (54) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వాడు. అయితే ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురైన సోములు ఆదివారం ప్రాణాలు వదిలాడు. దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మరిన్ని వార్తలు