బాబు క్యాంప్ ఆఫీసులో త్రుటిలో తప్పిన ప్రమాదం

6 Aug, 2014 04:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం లేక్‌వ్యూ అతిథి గృహంలో పని చేస్తున్న రోజువారీ కూలీలకు త్రుటిలో ప్రమాదం తప్పింది. క్యాంపు కార్యాలయంలో భద్రతా సిబ్బంది విశ్రాంతి కోసం ఒక హాలును నిర్మిస్తున్నారు. దీనికోసం మంగళవారం కూలీలు పునా దులు తీసేందుకు ఉపక్రమించారు. మట్టి తవ్వుతుండగా గడ్డపార వెళ్లి భూమిలో ఉన్న కరెంట్ వైర్లకు తాకింది. దీంతో గడ్డపార పట్టుకున్న కూలీకి కరెంట్ షాక్ తగిలి కిందపడిపోయాడు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు