విజయసాయిరెడ్డి మే 2వ తేదీ నుంచి పాదయాత్ర

29 Apr, 2018 12:46 IST|Sakshi
రాజ్యసభ సభ్యుడు, విజయసాయిరెడ్డి

ఆరిలోవ(విశాఖ తూర్పు) : వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్రకు సంఘీభావంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి జీవీఎంసీ పరిధిలో మే 2వ తేదీ నుంచి పాదయాత్ర చేపట్టనున్నారని ఆ పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్‌ తెలిపారు. ఈ పాదయాత్ర అగనంపూడిలో వైఎస్సార్‌ విగ్రహం వద్ద ప్రారంభంకానుందన్నారు. పెందుర్తి, విశాఖ పశ్చిమ, ఉత్తర, తూర్పు నియోజకవర్గాల మీదుగా దక్షిణ నియోజకవర్గానికి పాదయాత్ర చేరుకుంటుందని చెప్పారు.

ఆయా ప్రాంతాల్లో ప్రజా సమస్యలు తెలుసుకుంటారని తెలిపారు. మే 12న జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. పాదయాత్ర రోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుందన్నారు.

మరిన్ని వార్తలు