గంగవరం: పట్టపగలే వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన మంగళవారం జరిగింది. పలమనేరు ఫైర్ స్టేషన్ సమీపాన చెట్లపొదల మధ్య ఓ వ్యక్తిని కొందరు వ్యక్తులు బండరాయితో హతమార్చి పరారైనట్లు పోలీసులు తెలిపారు. హత్యకు గురైన వ్యక్తి వయసు 35 సంవత్సరాలు ఉంటుంది. గళ్ల టీ షర్టు గోధుమ రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. హతుడు ఉత్తర భారతదేశానికి చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ చౌడేశ్వరి, సీఐ వెంకటేశ్వరులు పరి శీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.