రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

16 Sep, 2018 09:27 IST|Sakshi

గిద్దలూరు రూరల్‌: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండలంలోని ముండ్లపాడు రోడ్డు రైస్‌ మిల్లు సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో జరిగింది. అందిన వివరాల ప్రకారం.. ముండ్లపాడు గ్రామానికి చెందిన పవన్‌ కళ్యాణ్‌ (21) అనే యువకుడు తన బైక్‌పై గిద్దలూరు నుంచి తిరిగి స్వగ్రామం బయల్దేరాడు. మార్గమధ్యంలోని ముండ్లపాడు రైస్‌ మిల్లు సమీపంలో బైకు అదుపుతప్పి కిందపడిపోయింది. ప్రమాదంలో తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడు పవన్‌ కళ్యాణ్‌ను గమనించిన వాహనదారులు అతడి బంధువులకు సమాచారం అందించారు. అనంతరం చికిత్స కోసం నంద్యాల తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. 

>
మరిన్ని వార్తలు