జీసీ కేబుల్పై యువకుల దాడి

16 Mar, 2015 16:35 IST|Sakshi

గుంటూరు: నర్సారావు పేటలో జీసీ కేబుల్పై కొందరు యువకులు దాడి చేశారు. కేబుల్ సామాగ్రిని ధ్వంసం చేసి డిష్ యాంటెనాలను గొడ్డళ్లతో నరికివేశారు. దీంతో 94 గ్రామాలకు పూర్తిగా ప్రసారాలు నిలిచిపోయాయి. కేబుల్ను విక్రయించకపోవడంతోనే మొత్తం ఎనిమిదిమంది యువకులు దాడి చేశారని బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం పల్నాడు రోడ్డులో ఉన్న జీసీ కేబుల్ కార్యాలయంపై కూడా దాడి జరిగింది.

>
మరిన్ని వార్తలు