రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

9 Jan, 2017 10:02 IST|Sakshi

వరదయ్యపాలెం: చిత్తూరు జిల్లా తడ–వరదయ్యపాలెం ప్రధాన రోడ్డు మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన ఇనమాలగుంట వద్ద ఆదివారం రాత్రి చోటచేసుకుంది. మత్తేరిమిట్ట పంచాయతీ పరిధి తొండూరు సొసైటీకి చెందిన రంజిత్‌(23) ద్విచక్ర వాహనంపై వరదయ్యపాలెం వెళ్తుండగా ఎదురుగా వస్తున్న తమిళనాడుకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. తీవ్ర గాయాల పాలైన యువకుడిని చికిత్స నిమిత్తం శ్రీసిటీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే అతడు మృతి చెందాడు.

మరిన్ని వార్తలు