వేటగాళ్ళ ఉచ్చుకు యువకుడి బలి

21 Jan, 2015 16:13 IST|Sakshi
వేటగాళ్ళ ఉచ్చుకు యువకుడి బలి

ఏలూరు: అడవి జంతువుల కోసం వేటగాళ్ళు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఓ యువకుడు బలయ్యాడు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం కంచనగూడెంలో మంగళవారం రాత్రి జరిగింది. కంచనగూడెం సమీపంలో ఉన్న పొలాల్లో వేటగాళ్ళు అడవి పందులు, దుప్పుల కోసం విద్యుత్ తీగలు అమర్చారు. గ్రామానికి చెందిన నున్న అరుణకుమార్ (29) పశువులకు మేత వేసి వస్తానని చెప్పి పొలంలోకి వెళ్తుండగా ఆ విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.

విషయం తెలుసుకున్న వేటగాళ్ళు అరుణకుమార్ మృత దేహాన్ని సుమారు అర పర్లాంగ్ దూరం ఈడ్చుకు వెళ్ళి మరో రైతు పొలంలో పడేసి పరారయ్యారు. బుధవారం ఉదయం పొలంలో మృతదేహాన్ని చూసిన గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్నిపరిశీలించి కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు