కడప కార్పొరేషన్ : కడప నగరం 23వ డివిజన్లోని రాజారెడ్డివీధిలో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, మేయర్ సురేష్బాబు, ఎమ్మెల్యే అంజాద్బాష తదితరులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వాతావరణంలో ఉష్ణోగ్రతలు, కాలుష్యం తగ్గాలంటే మొక్కలు పెంచడం తప్పనిసరి అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కడప నగరాన్ని గ్రీన్సిటీగా మార్చాలన్నారు. కార్యక్రమంలో 23వ డివిజన్ కార్పొరేటర్ జేసీబీ పీటర్స్, కార్పొరేషన్ రెవెన్యూ ఆఫీసర్ రాధిక, మనోహర్రెడ్డి, రెడ్డెయ్య, న్యూమోడల్ స్కూలు సిబ్బంది పాల్గొన్నారు.